దేశ వ్యాప్తంగా గత నెల రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తీరు ఆందోళన కలిగించింది.గత ఏడాది 90 వేలకు అటు ఇటుగా ఉండి తగ్గుముఖం పట్టాయి.
కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గత ఏడాది రోజు వారి కేసులు లక్ష చేరుకోలేదు.కాని సెకండ్ వేవ్ లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది.
రోజుకు నాలుగు లక్షలు దాటిన సందర్బాలు ఉన్నాయి.అయిదు లక్షలకు మించి కేసులు నమోదు అవుతాయేమో అన్నట్లుగా ఆందోళన కలిగింది.
నెల రోజుల తర్వాత కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతూ వస్తోంది.దాదాపుగా నెల రోజుల తర్వాత కేసులు మూడు లక్షల లోపుకు చేరాయి.మరి కొన్ని రోజుల్లో మరింతగా తగ్గే అవకాశం ఉందంటున్నారు.ఈ నెల చివరి వరకు లక్ష లోపు కేసులు నమోదు అవుతాయని అంటున్నారు.
కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారులు మరియు కొందరు నాయకులు అంటున్నారు.ఈ సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండి సేఫ్ గా పనులు చేసుకోవాలంటూ నాయకులు సూచిస్తున్నారు.