ప్రపంచ దేశాలలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి.వైరస్ రోజూ లక్షల్లో నమోదవుతున్నాయి.
రాష్ట్రల్లోనూ ఇదే పరిస్థితి.జిల్లాల్లో రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.
ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకున్న వైరస్ ను కట్టడి చేయలేకపోతున్నారు.ఒకరి నుంచి మరోకరిని ఇజీగా వ్యాపిస్తోంది.
ప్రజల్లో అవగాహన పెంచినా ఎలాంటి మార్పు రావడం లేదు.
మాస్కులు ధరించడం, శానిటైజేషన్ చేయడం, సామాజిక దూరం పాటించడం మరిచారు.
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు అని తెలిసినా రోడ్లపైనే కాలక్షేపాలు చేస్తున్నారు.దీంతో వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది.
ఏపీ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి.టెస్టులు సంఖ్య పెంచడంతో కేసులు అధిక సంఖ్యలో నిర్ధారణ అవుతున్నాయి.
ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.అత్యధికంగా నిన్న ఒక్క రోజే 783 కేసులు వచ్చాయి.దీంతో జిల్లా వ్యాప్తంగా కేసుల సంఖ్య 6817 కు చేరింది.ప్రకాశం తర్వాత ఒంగోలు జిల్లాలో 142 కేసులు నమోదవ్వగా నగర కార్పొరేషన్ కార్యాలయంలో నలుగురు ఉద్యోగులకు పాజిటివ్ వచ్చింది.
నిన్న 5 మంది మృతి చెందడంతో సంఖ్య 73కు చేరింది.అధికారులు 1,51,205 శ్యాంపిళ్లు సేకరించగా.
అందులో 1,47,005 మందికి నెగిటివ్ వచ్చింది.ఇంకా 4392 మంది రిపోర్టుల ఫలితాలు రావాలి.