దేశంలో కరోనా విజృంభణ.. 43 లక్షలకు పైగా !

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.రాష్ట్రాలల్లో రోజుకూ వేలల్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

 India, Corona, Cases, Deaths-TeluguStop.com

దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇప్పటికే దేశవ్యాప్తంగా 43 లక్షలకు కరోనా కేసులు దాటడంతో సరికొత్త రికార్డును సృష్టించింది.

ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా కేసుల వ్యాప్తి పెరుగుతూనే ఉంది.సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు కరోనా భయం పుట్టుకొచ్చింది.

కరోనా నుంచి కోలుకుంటున్న వారితో పాటు మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 89,706 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటివరకూ దేశంలో మొత్తంగా 43,70,129 కేసులకు పెరిగింది.

నిన్న ఒకే రోజు 1,115 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా.ఆ సంఖ్య 73,890కి చేరింది.

ఇప్పటివరకు కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 33,98,845కి పెరిగింది.ప్రస్తుతం దేశంలో 8,97,394 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

అన్ లాక్-4 ప్రక్రియ కొనసాగుతుండటంతో దేశంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ సూచించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube