దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.రాష్ట్రాలల్లో రోజుకూ వేలల్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇప్పటికే దేశవ్యాప్తంగా 43 లక్షలకు కరోనా కేసులు దాటడంతో సరికొత్త రికార్డును సృష్టించింది.
ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా కేసుల వ్యాప్తి పెరుగుతూనే ఉంది.సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు కరోనా భయం పుట్టుకొచ్చింది.
కరోనా నుంచి కోలుకుంటున్న వారితో పాటు మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.
తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 89,706 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటివరకూ దేశంలో మొత్తంగా 43,70,129 కేసులకు పెరిగింది.
నిన్న ఒకే రోజు 1,115 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా.ఆ సంఖ్య 73,890కి చేరింది.
ఇప్పటివరకు కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 33,98,845కి పెరిగింది.ప్రస్తుతం దేశంలో 8,97,394 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
అన్ లాక్-4 ప్రక్రియ కొనసాగుతుండటంతో దేశంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ సూచించింది.