తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది.రోజూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
ఇప్పటి వరకూ 1500 నుంచి 1800 కేసులు నమోదు కాగా.శుక్రవారం ఒక్కరోజే 2083 కేసులు నమోదయ్యాయి.
దీంతో రాష్ట్రంలో కరోనా పేషంట్ల సంఖ్య 64,786కి చేరింది.
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న కోవిడ్ యాంటిజెన్ ర్యాపిట్ టెస్టులు శుక్రవారం ఒకటే రోజు 21,011 నిర్వహించారు.ఇప్పటి వరకూ మొత్తంగా 4,58,593 టెస్టులు నిర్వహించగా 883 టెస్టుల ఫలితాలు రావాలి.11 మంది మరణించడంతో మరణాల సంఖ్య 530కి చేరింది.1,114 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.దీంతో ఇప్పటివరకు వారి సంఖ్య 46,502కు చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న యాక్టివ్ కేసులు 17,754, వీరిలో హోం క్వారంటైన్ లో ఉన్న వారు 11,359 మంది.
హైదరాబాద్ నగర జీహెచ్ఎంసీ పరిధిలో శుక్రవారం 578 కేసులు నమోదయ్యాయి.
రంగారెడ్డి 228, మేడ్చల్ 197, వరంగల్ అర్బన్ 134, కరీంనగర్ 108, నిజామాబాద్ 73, నల్గొండ 48, మహబూబాబాద్ 40, పెద్దపల్లి 42, రాజన్న సిరిసిల్ల 39, భద్రాద్రి కొత్తగూడెం 35, ఖమ్మం 32, ఆసిఫాబాద్ 8, నారాయణ్ పేట్ 9, వనపర్తి 9. ఇలా అన్ని జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి.