తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.రోజురోజుకి కేసులు వేలల్లో నమోదువుతున్నాయి.
ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ కట్టడి కష్టతరమవుతోంది.తెలంగాణ ఆరోగ్య శాఖ తాజాగా కరోనా హెల్త్ బులిటిన్ ను విడుదల చేసింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,817 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటివరకూ మొత్తంగా 1,33,406 కరోనా కేసులు నమోదయ్యాయి.2611 మంది కరోనా బారిన పడి కోలుకోగా.వీరి సంఖ్య 1,00,013కి చేరింది.
నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు.దీంతో మరణాల సంఖ్య 856కు చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 32,537 యాక్టివ్ కేసులు ఉండగా.వీరిలో 25,293 మంది హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కరోనా కేసులు ఇలా ఉన్నాయి.జీహెచ్ఎంసీ పరిధిలో 452, రంగారెడ్డిలో 216, మేడ్చల్ మల్కాజిగిరిలో 129, సూర్యపేటలో 116, భద్రాద్రి కొత్తగూడెంలో 89, జగిత్యాలలో 88, జనగాంలో 41, జయశంకర్ భూపాలపల్లిలో 26, కామారెడ్డిలో 62, జోగులాంబ గద్వాల్ లో 33, మహబూబ్ నగర్ లో 42, మహబూబాబాద్ లో 62, మంచిర్యాలలో 71, కరీంనగర్ లో 164, నిజామాబాద్ లో 97, వికారాబాద్ లో 27 వరంగల్ అర్బన్ లో 114, వరంగల్ రూరల్ లో 46 చొప్పున కేసులు నమోదయ్యాయి.