ఏపీలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది.అక్కడ నిత్యం వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.
అయితే ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్యలో మహారాష్ట్ర తరువాత ఏపీ ఉంది.దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలను కోల్పోయారు.మరికొంత మంది ఈ మహమ్మారి బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే తాజాగా శనివారం నాడు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేశారు.
అయితే ఏపీలో గడిచిన 24గంటల్లో 61,469 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
అందులో 10,276 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా నిర్దారణ చేశారు.దీంతో ఏపీలో మొత్తం కరోనా బారినపడిన వారి సంఖ్య 3,45,216కు చేరుకుంది.
అయితే కరోనా బారి నుండి 8,593 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ఇంటికి వెళ్లారు.అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా 89,389 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
అయితే గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 97 మంది కరోనా బారిన పడి చనిపోయారు.దీంతో ఏపీలో కరోనా మరణాల సంఖ్య 3,189కి చేరుకుంది.