వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా.. ఐసీయూకు తరలించిన డాక్టర్లు.. !

దేశంలో వ్యాపిస్తున్న కరోనా సెకండ్ వేవ్ మహ ఖతర్నక్‌గా ఉంది కావచ్చూ.ఇప్పటి వరకు పలు రాష్ట్రాల రాజకీయనేతలను అసలే వదలడం లేదు.

 Corona Positive For Ycp Mla Undavalli Sridevi , Guntur, Tadikonda Mla, Undavalli-TeluguStop.com

ఈ మధ్యకాలంలో ఎక్కువగా పొలిటికల్ లీడర్స్ కరోనా బారినపడటం తరచుగా జరుగుతుంది.

ఇకపోతే తాజాగా గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది.

కాగా ప్రస్తుతం శ్రీదేవి హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, శ్రీదేవి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొవిడ్ కారణంగా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ చేరడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారంటూ ఆమె కార్యాలయం పేర్కొంది.

ఇదిలా ఉండగా శ్రీదేవి ఆరోగ్యం క్షీణించిందని వస్తున్న వార్తలు అవాస్తవమని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే ఆమె పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని, కాబట్టి అభిమానులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలియచేస్తున్నారు శ్రీదేవి కార్యాలయ అధికారులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube