విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మున్సిపల్ పరిధిలో 8వ వార్డు లో గల పురపాలక ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ నిర్దారణ కావడం కలకలం రేపుతోంది.పాఠశాలలో ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు కోవిడ్ మార్గదర్శకాలలో భాగంగా జయప్రకాష్ పురపాలక పాఠశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.
ఆ క్లాస్ లో మొత్తం 26 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 10 మందికి కరోనా పాజిటివ్ అని స్థానిక అధికారులు ధ్రువీకరించారు.
దీంతో విద్యార్థులందరికీ వారి తల్లిదండ్రులకు పరీక్ష నిర్వహణ వేగవంతం చేశారు.
అదేవిధంగా కోవిడ్ ఆందోళన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు వారం రోజులు సెలవు ప్రకటించారు.అలాగే మహా విశాఖ నగర పాలక సంస్థ 89వ వార్డు పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరుగురికి వైరస్ సోకింది.
ఈ నెల 23న విద్యార్థులకు కోవిడ్(covid) నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పదోతరగతి చెందిన నలుగురిక 6, 9 చదువుతున్న ఒక్కొక్కరికి పాజిటివ్ వచ్చినట్లు బుధవారం తెలిసింది.రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 1601 కరోనా కేసులు నమోదయ్యాయని, 16 మంది మరణించారన వైద్య శాఖ బుధవారం వెల్లడించింది.