దేశంలో కరోనా ఉధృతి కొంచెం తగ్గిందనే చెప్పవచ్చు.గత నాలుగు రోజులుగా కరోనా కేసులు 85 వేలకు పైగా నమోదయ్యాయి.
కానీ ఈ రోజు 82 వేలకు చేరింది.దీంతో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుందనే చెప్పవచ్చు.
వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని దేశ ప్రజలు అజాగ్రత్తగా ఉండవద్దని, కరోనా నిబంధనలు పూర్తి స్థాయిలో పాటించాలని సూచించారు.పూర్తి స్థాయిలో కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంతవరకూ ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇప్పటికే దేశంలో కరోనా కొత్త కేసుల నమోదులో అగ్రస్థానంలో ఉందని, రికవరీలో రేటులో కూడా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తాజాగా భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.
గడిచిన 24 గంటల్లో దేశంలో 82,170 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 60,74, 703కి పెరిగింది.దీంతో దేశం సరికొత్త రికార్డును సృష్టించింది.నిన్న ఒక్కరోజే దేశంలో 1,039 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారని, దీంతో ఇప్పటివరకూ దేశంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 95,542కు పెరిగింది.
ప్రస్తుతం దేశంలో 9,62,640 యాక్టివ్ కేసులు ఉన్నాయని, ఇప్పటివరకూ 50,16,521 మంది కరోనా బారిన పడి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది.గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,09,394 మంది అనుమానితులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని, దీంతో ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 7,19,67,230 మందికి కరోనా శాంపిళ్ల పరీక్షలు చేశామని భారతీయ వైద్య పరిశోధనా మండలి తెలిపింది.