దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.రోజూ 80 వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
రికార్టు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.నిన్న 86 వేలకు నమోదైన కరోనా కేసులు.
నేడు వెయ్యి తక్కువగా నమోదయ్యాయి.దీంతో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 59 లక్షలకు దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.కరోనా కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది.
ప్రపంచ దేశాలు కలిసికట్టుగా ఉండి.కరోనాతో పోరాడకపోతే భవిష్యత్ లో కరోనా మృతుల సంఖ్య 20 లక్షలకు చేరుతుందని డబ్ల్యూహెచ్ఓ తాజాగా వెల్లడించింది.
ప్రపంచ దేశం కలిసికట్టుగా ఉంటూ చర్యలు తీసుకోవాలని కోరింది.
తాజాగా దేశ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.
గడిచిన 24 గంటల్లో దేశంలో 85,362 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 59,03,933కి చేరింది.కరోనా కేసుల పెరుగుదలలో భారత్ సరికొత్త రికార్డును సృష్టించింది.నిన్న ఒక్కరోజే 1,089 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా… ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 93,379కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 9,60,969 యాక్టివ్ కేసులు ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో 93,420 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
దీంతో దేశంలో ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 48,49,585కి చేరింది.దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 13,41,535 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా… ఇప్పటివరకూ నిర్వహించిన మొత్తం నిర్ధారణ పరీక్షల సంఖ్య 7,02,69,975కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.