దేవుడిపై భక్తి ఉండవచ్చు, ఆ భక్తితో దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆరాధించడం కూడా చేయవచ్చు.కాని కొందరు దేవుడి భక్తి పేరుతో చేసే పనులు చిత్ర విచిత్రంగా అనిపిస్తాయి.
దేవుడిపై భక్తి, దేవుడి బాగు అంటూ కొందరు చేస్తున్న పనులు విడ్డూరంగా అనిపిస్తాయి.దేవుడు మనలాగే మనిషి అని, ఆయనకు ప్రసాదంగా పెద్ద మొత్తంలో తిను బండారాలు పెడుతూ ఉంటారు.
సరే అవి మళ్లీ మనమే తింటాము కనుక పర్వాలేదు.కొన్ని మాత్రం దేవుడిపై భక్తి అంటూ మూడంగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్ఫూర్లోని సిద్ది వినాయక ఆలయంలో చిత్రమైన సంఘటన జరిగింది.ఎండలు తీవ్రంగా ఉండటంతో వినాయకుడికి చాలా ఇబ్బందిగా ఉంటుందట.వినాయక విగ్రహం ఎండల వల్ల ఇబ్బంది పడుతుందని, అసలే ఎండా కాలం అవ్వడంతో పాటు, సరైన చల్లటి గాలి కూడా వినాయకుడికి లేక పోవడంతో ఆయన బాధపడుతున్నాడని ఆలయ అధికారులు భావించారట.దాంతో మరో మాట ఆలోచించకుండా వెంటనే దేవుడికి కూలర్ ఏర్పాటు చేశారు.
దేవాలయంలో పాతిక వేలు పెట్టి చల్లగా ఉండేలా కూలర్ను ఏర్పాటు చేశారు.ఈ విషయం ఆనోట ఈనోట పాకి వైరల్ అయ్యింది.ఈ సంఘటనను విడ్డూరం అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.అయితే దేవాలయ అధికారులు మరియు పూజారులు మాత్రం తాము చేసిన పనిలో తప్పేముందని అంటున్నారు.వేసవి అవ్వడం వల్ల వినాయకుడికి వేస్తున్న దుస్తువులను కూడా మార్చినట్లుగా వారు చెప్పారు.పల్చని దుస్తులు వేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
మొత్తానికి దేవుడిని కూడా సాదారణ మనిషిని చేసి అధికారులు మరియు పూజారులు సమ్మర్ స్పెషల్గా ఏర్పాట్లు చేస్తున్నారు.