కన్వెన్షన్ సెంటర్ అనుకోగానే హైదరాబాదే గుర్తుకొస్తుంది.ఇక్కడి కన్వెన్షన్ సెంటర్ చాలా గొప్పగా ఉంటుంది.
అంతర్జాతీయ సమావేశాలు, సభలు జరిగే ఈ కన్వెన్షన్ సెంటర్లో సామాన్యులు అడుగు పెట్టలేరు.సినిమా తారల దగ్గర దండిగా డబ్బు ఉంటుంది కాబట్టి వారు అప్పుడప్పుడు పెళ్లిళ్లు మొదలైన కార్యక్రమాలు చేస్తుంటారు.
ఏదైనా గ్రాండ్గా చేయాలంటే హైదరాబాద్లోని కన్వెన్షన్ సెంటర్ తప్ప మరోటి లేదు.అయితే ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో కూడా హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ను తలదన్నేలా కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తారట.
దీని ఖర్చు నలభైఐదు కోట్లు.ఏపీ రాష్ర్ట విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ విషయం చెప్పారు.
ఈ కన్వెన్షన్ సెంటర్లో ఒకేసారి రెండువేల ఐదొందల మంది కూర్చునేందుకు అవకాశం ఉంటుంది.ఇక వంద కోట్లతో కూచిపూడి కళాపీఠం అభివృద్ధి చేస్తారట.
ఏపీలోనూ భారీ నిర్మాణాలు అవసరమే.ఆ కొరత తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.
రాష్ర్టం విడిపోయాక కూడా ఆంధ్రావారు తెలంగాణకు వచ్చి కార్యక్రమాలు చేసుకోవడం బాగుండదుకదా.