విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో భాగంగా.కృష్ణానదిలో జరిగే కనకదుర్గమ్మ తెప్పోత్సవంపై సందిగ్ధత నెలకొంది.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరదలతో కృష్ణా నదికి నీటి ఉధృతి పెరుగుతుండటంతో దేవస్థాన అధికారులు అయోమయంలో పడ్డారు.ఈ క్రమంలో అమ్మవారి తెప్పోత్సవం నిర్వహించాలా వద్దా అన్నది సంశయంగా మారింది.
నదీ వివాహరం లేకుండా హంస వాహనంపై మాత్రమే ఊరేగింపు నిర్వహించాలా అనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై దుర్గగుడి అధికారులు సమావేశం నిర్వహించిన అనంతరం తెప్పోత్సవంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అయితే, గతేడాది కూడా వరదల కారణంగా హంస వాహన విహరం లేకుండా నదీ ఒడ్డున తెప్పోత్సవం ముగిసిన సంగతి తెలిసిందే.