హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ నిర్వాకం వివాదాస్పదంగా మారింది.పబ్ లో కస్టమర్లను ఆకర్షించేందుకు జంతు ప్రదర్శనను ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
అడవి జంతువులను తీసుకువచ్చి పబ్ లో పెట్టిన నిర్వాహకులు కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.దీనిపై ఓ యువకుడు ట్విట్టర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో ఈ ఘటనపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ స్పందించారు.ఈ విషయాన్ని డీజీపీ, సీపీ దృష్టికి తీసుకెళ్తానంటూ ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చారు.
అదేవిధంగా జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.