టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరొకవైపు రాజకీయాలలో బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా ఇప్పటికీ ఎప్పుడో పూర్తి అవ్వాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది.
పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాను పూర్తి చేయడం కోసం ప్రత్యేకంగా సమయానికి కేటాయిస్తున్నప్పటికీ ఈ సినిమా ముగింపుదశకు చేరుకోవడం లేదు.
భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలను నెలకొన్నాయి.ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.
ఇది ఇలా ఉంటే తరచూ వివాదాస్పద కామెంట్స్ తో వార్తల్లో క్రిటిక్ ఉమైర్ సంధు తాజాగా హరిహర వీరమల్లు సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.ప్రస్తుతం ఉమైర్ సంధు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రషెష్ చూశాను.అవుట్ ఫుట్ పట్ల పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నారు.
దీనితో దర్శకుడు పై టెక్నికల్ టీం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఉమైర్ సంధు ట్వీట్ లో పేర్కొన్నారు.
కాగా ఈ ట్వీట్ పై స్పందించిన నెటిజన్స్ సమయం సందర్భం లేకుండా నెగటివ్ కామెంట్స్ చేయడం పట్ల ఉమైర్ సంధు దుమ్మెత్తి పోస్తున్నారు.అతనిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.అసలు నీకు ఈ సమాచారం ఎలా వచ్చింది నువ్వు హరిహర వీరమల్లు సినిమాకీ లైట్ బాయ్ గా పని చేస్తున్నావా అంటూ ట్రోలింగ్స్ చేయడం మొదలుపెట్టారు.
ఎప్పుడూ నీకు ఫేక్ న్యూస్ సృష్టించడమే ఒక పనినా అంటూ నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.