జుట్టు కత్తిరించడంలో సెలూన్ సిబ్బంది చేసిన నిర్లక్ష్యం కారణంగా హెయిర్ సెలూన్ యాజమాన్యం రెండు కోట్ల నష్టపరిహారం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఓ సెలూన్ కి.ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
వివరాలు చూస్తే.ఢిల్లీలోని హెయిర్ సెలూన్ కు ఓ హెయిర్ ప్రొడక్ట్స్ మోడల్ ఆష్ణా రాయ్ హెయిర్ కటింగ్ చేసుకోవడానికి వెళ్ళింది.
అయితే ఆమె సెలూన్ సిబ్బందిని ‘ఫిక్స్’ స్టైల్ 4 అంగుళాలు మేరకు కత్తిరించాలని కోరింది.అయితే సెలూన్ సిబ్బందికి ఆమె చెప్పిన మాటలు వినిపించక నాలుగు అంగుళాల జుట్టును మాత్రమే మిగిల్చి మిగతా జుట్టును కత్తిరించేశారు.
దీంతో మోడల్ ఆస్నా రాయ్ షాక్ కు గురయింది.వెంటనే సెలూన్ మేనేజ్మెంట్ కు ఆమె ఫిర్యాదు చేయగా వారు ఆమెకు హెయిర్ ట్రీట్మెంట్ ఉచితంగా చేశారు.
అయినా కూడా ఆ ట్రీట్మెంట్ కారణంగా ఆమె జుట్టు శాశ్వతంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా ఆస్నా రాయ్ తన అందమైన జుట్టుతోనే పెద్ద పెద్ద హెయిర్ కేర్ బ్రాండ్లకు మోడలింగ్ చేస్తోంది.
ఇప్పుడు హెయిర్ కట్ చేయడంతో ఆమెకు వచ్చే ఆఫర్లన్నీ కోల్పోయింది.దీంతో ఆమె జీవనశైలి మొత్తం మారిపోయిందని తీవ్ర ఆవేదనకు గురైంది.టాప్ మోడల్ కావాలనే ఆమె కల చెదిరిపోవడంతో ఆమె తీవ్రమైన మానసిక వేదనకు, ఒత్తిడికి గురి అయింది.తన పని పై దృష్టి పెట్టలేకపోయింది.
తన అందమైన జుట్టు కారణంగా వచ్చే మోడలింగ్ ఆఫర్లు రాకపోవడంతో, తన జీవనాధారం దెబ్బతిందని ఆమె కన్స్యూమర్ కోర్టులో హెయిర్ సెలూన్ యాజమాన్యం పై ఫిర్యాదు చేసింది.తనకు రూ.3 కోట్లు నష్ట పరిహారం చెల్లించాలని కోరింది.ఆమె ఫిర్యాదును పరిశీలించిన కన్స్యూమర్ కోర్ట్ సెలూన్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఆష్ణా జుట్టు కోల్పోయిందని నిర్ధారించి బాధితురాలికి 2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, అది కూడా మొత్తం సొమ్ము బాధితురాలికి కేవలం 8 వారాలలో చెల్లించాలని ఆదేశించింది.