ఒకప్పుడు బీజేపీ అంటే ప్రజల్లో ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.కానీ గత కొద్దినెలల క్రితం నుండి కేంద్రం అవలంభిస్తున్న విధానాల వల్ల దేశ ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడిందనే ప్రచారం జరుగుతుంది.
ఈ నేపధ్యంలో ఢిల్లీ రైతు సమస్యలు కూడా కేంద్రం మెడకు ఉక్కులా బిగుసుకుంటున్న విషయం తెలిసిందే.ఇకపోతే నిన్న కేంద్రం వివిధ రకాల చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తూ ప్రకటన విడుదల చేసిన విషయం, ఈ విషయంలో విమర్శలు వెల్లువెత్తిన తరువాత, ఈ ఉదయం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్టుగా కేంద్రం ప్రకటించింది.
అయితే ఈ అంశంలో కొన్ని గంటల వ్యవధిలోనే వెనకడుగు వేయడంపై కాంగ్రెస్ సెటైర్లు వేసింది.ఈ నేపధ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ స్పందిస్తూ ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైందని ప్రశ్నించిన సోనియా గాంధీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆ పదవిలో కొనసాగే నైతికత లేదని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా ఆర్థిక మంత్రి ఏమైనా సర్కస్ నడుపుతున్నారా? అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా సైతం బీజేపీపై మండిపడ్డారు.