సహజంగా నాయకులు నదులు లాంటి వాళ్ళు…నదులు ఎటు వీలు ఉంటే అటు గల గల.పారుతూ వెళ్ళిపోతున్ ఉంటాయి.
నాయకులు కూడా అలాంటి వారే ఏ పార్టీ అధికారంల్ ఉంటే ఆ పార్టీలోకి జంప్ అయ్యి పోవడం, మంత్రులుగా మారిపోయి సంపాదించేసుకోవడం.షరా మామూలే.
ఇదిలా ఉంటే తెలంగాణాలో కొంగ్రెస్ పార్టీ దీనికి చెక్ పెట్టె దిశగా ఆలోచనలు చేస్తుంది.కేసీఆర్ ఆకర్షణ మంత్రంతో తక్షణ లబ్థి కోసం తెలంగాణ అధికారపక్షంలోకి దుమికేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చుక్కలు చూపిస్తాం అంటుంది ఆ పార్టీ.
ఇంతవరకు మౌనంగా ఉన్న కొంగ్రెస్ ఇప్పుడు ఒక్కసారిగా టీ- సర్కార్ లోకి దూకిన తమ పార్ట్ నేతలకు జలక్ ఇవ్వబోతుంది.పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించటమే దీనికి నిదర్శనంగా తెలుస్తుంది.
ఈ పిటీషన్ను స్వీకరించిన హైకోర్టు.వారంలోగా వివరణ ఇవ్వాలని పార్టీ మారిన సదరు ఎమ్మెల్సీలను ఆదేశించింది.
విభజన అనంతరం.పలువురు ఎమ్మెల్యేలు.
ఎమ్మెల్సీలు తెలంగాణ అధికారపక్షమైన టీఆర్ఎస్లో చేరటం తెలిసిందే.ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా జంపిగ్స్ను ప్రోత్సహించేలా మాట్లాడే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి మొహమాటాలకు గురి కావటం లేదు.
తమ పార్టీలోకి వచ్చేందుకు ఎంతమంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మీడియా సాక్షిగా చెప్పేస్తున్నారు.ముఖ్యమంత్రి దూకుడుకు కళ్లెం వేయటంతో పాటు.
ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణలో కీలకభూమిక పోషించే దిశగా పార్టీ పయనించాల్సిన అవసరం ఉందని కొంగ్రెస్ ఈ రకంగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.ఏది ఏమైనా కాంగ్రెస్ చేస్తునం పనిని అందరూ మెచ్చుకుని తీరాలి.