తెలంగాణ రాజకీయాలలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.రెండో సార్వత్రిక ఎన్నికలో విజయానికి ముందు వరకు టీఆర్ఎస్ కు సరైన రాజకీయ ప్రత్యర్థి లేరు.
ఇప్పుడు కొంత బలంగా మారిన కాంగ్రెస్, బీజేపీ కూడా అంతగా నాయకత్వ లేమితో కొట్టిమిట్టాడుతూ ఉన్న పరిస్థితి ఉంది.అయితే బండి సంజయ్ బీజేపీ చీఫ్ గా నియమింప బడటం, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకం తర్వాత కాంగ్రెస్, బీజేపీ కొంత బలపడినా ఇప్పుడు టీఆర్ఎస్ తరువాత రెండో స్థానం కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్న పరిస్థితి ఉంది.
అయితే బీజేపీ దూసుకెళ్తున్న విధానం కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
అయితే బీజేపీ ఇటు పాదయాత్రలు, మీడియా సమావేశాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా టీఆర్ఎస్ ను ఎండగడుతూ వస్తోంది.
కాని కాంగ్రెస్ ఈ విషయంలో బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ కాస్త వెనుకబడిందని చెప్పుకోవచ్చు.అయితే రేవంత్ బీజేపీని వెనక్కి నెట్టేలా బలమైన వ్యూహాల్ని సిద్దం చేస్తున్నట్టు సమాచారం.
ప్రతి ఒక్క ఎమ్మెల్యే చిట్టాను బయటికి తీసి, వారి పనితీరుపై ప్రజల్లో చర్చ మొదలయ్యేలా ఒక వ్యూహాన్ని సిద్దం చేస్తున్నారు.ఈ వ్యూహాన్ని ఇప్పటివరకు బీజేపీ ప్రయోగించలేదు.
తద్వారా టీఆర్ఎస్ ను క్షేత్ర స్థాయిలో ఇబ్బందిపేటవచ్చు అన్నది రేవంత్ వ్యూహంలా అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.