రాబోయే లోక్ సభ ఎన్నికలపై తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana Assembly Elections ) సాధించిన విజయాన్ని కొనసాగిస్తూ, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను గెలుచుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉండగా, తెలంగాణలో తమకు ఎదురైన ఓటమి నుంచి తేరుకుని వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలనే పట్టుదలతో బీఆర్ఎస్( BRS ) కూడా ఉంది.
ఈ మేరకు ఆ పార్టీ అధినేత కేసిఆర్ ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను తమకంటే తక్కువ స్థానాలకు పరిమితం చేసి అప్పుడే కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందనే సంకేతాలు ఇవ్వాలనే ప్లాన్ లో ఉన్నారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకోవడం కంటే ఆ పార్టీ అధినేతగా ఉన్న కేసీఆర్ ను టార్గెట్ చేసుకోవడం వల్ల తమకు కలిసి వస్తుంది అని భావిస్తూ, గత కొద్దిరోజులుగా కేసీఆర్( KCR ) ఇమేజ్ ను డామేజ్ చేసే విధంగా కాంగ్రెస్ వ్యూహాలు( Congress Strategies ) రచిస్తోంది.ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ కు 64 స్థానాలు మాత్రమే వచ్చాయి .వీరిలో ఓ పదిమందిని తమ వైపునకు కేసీఆర్ తిప్పుకుంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది .ఈ వ్యూహం కేసీఆర్ లో ఉందో లేదో తెలియదు గాని , కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం మూడు, నాలుగు విషయాల్లో కేసిఆర్ పై పై స్థాయి నుంచి కింది స్థాయి నాయకులు వరకు విమర్శలు చేస్తున్నారు.

దీనికి కారణం కేసీఆర్ పార్టీ పరంగా ఓటమి చెందిన తెలంగాణలో ఆయన ఇమేజ్ కు డోఖా లేదని, గ్రామీణ ఓటర్లు ఇప్పటికీ కేసీఆర్ ను అభిమానిస్తూ ఉంటారని, ఆ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తేనే తాము అనుకున్న విధంగా కాంగ్రెస్ బలోపేతం అవుతుందనే ఆలోచనకు రేవంత్ రెడ్డి వచ్చారు.అందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యవహారాలన్నిటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ, వాటిలోని లోపాలను హైలెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.ముఖ్యంగా ప్రాజెక్టు విషయాన్ని ,ఇతర సంక్షేమ పథకాల్లోని లోపాలను హైలెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
విద్యుత్ ,రైతు సమస్యలు( Farmers Problems ), ప్రాజెక్టుల్లో అవినీతి వంటి వ్యవహారాలను బయటపెడుతూ కేసీఆర్ ఇమేజ్ ని డామేజ్ చేసే ప్రయత్నం మొదలుపెట్టారట.