కాంగ్రెస్ లో పార్టీలో ఉండే అంతర్గత ప్రజా స్వామ్యం ఎంతటిదో మనకు తెలిసిందే.అయితే అదే ప్రజా స్వామ్యం కాంగ్రెస్ పార్టీకి చాలా సార్లు నష్టాన్ని తెచ్చిపెట్టింది.
నాయకులందరు ఒక్క తాటిపైకి రాకపోవడం, గ్రూపు రాజకీయాలతో ప్రజల్లో పలుచబడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి.అలా కాంగ్రెస్ ఎన్నికల్లో ఓటమిని చవి చూడాల్సిన అవసరం కూడా వచ్చింది.
అందుకే గత పరిణామాలను ఊహించుకొని రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికంటే ముందే కాంగ్రెస్ సీనియర్ లను అందరిని ఇంటింటికి వెళ్లి వ్యక్తిగతంగా కలవడం జరిగింది.కాంగ్రెస్ ను బలోపేతం చేయడం పట్ల తనకున్న ఆలోచనలను రేవంత్ కు తెలిపిన విషయం మనకు తెలిసిందే.
అయితే ఇప్పుడు పరిస్థితి మరల మొదటికే వచ్చినట్లు కనిపిస్తోంది.అయితే రేవంత్ చేస్తున్న ఈ కృషి కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో పడింది.
దీంతో కాంగ్రెస్ సీనియర్ లు సైతం సభలలో పాల్గొంటూ కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు.
అయితే ఇప్పుడు ఎవరైతే రేవంత్ కు అంటీముట్టనట్టుగా ఉంటున్నారో ఇక సెంట్రల్ లీడర్స్ కూడా రేవంత్ సభల్లో పాల్గొంటుండటంతో ఇక అధిష్టానం దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోలేక తప్పనిసరి పరిస్థితులలో రేవంత్ వెంట నడవవలిసిన పరిస్థితి వస్తోంది.
కాని కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అందరూ ఒక్కటిగా పోరాడితేనే ఇప్పుడున్న గడ్డు పరిస్థితి నుండి బయటకు వచ్చి ఎంతో కొంత టీఆర్ఎస్ కు పోటీగా ఉండే అవకాశం ఉంది.అయితే ఇప్పటికే ఎంతో కొంత కాంగ్రెస్ కార్యకర్తలు యాక్టివ్ గా మారినా నియోజకవర్గాలలో మాత్రం స్థానికంగా అధికార పార్టీ పోరాడితేనే వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత స్థానాల కంటే ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు గెలిచే అవకాశం ఉంది.
మరి రేవంత్ వ్యూహాలు ఎంత వరకు కాంగ్రెస్ బలోపేతానికి దోహదపడతాయనేది చూడాల్సి ఉంది.