వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.వైయస్సార్ తెలంగాణ పార్టీ.
కొత్తగా పుట్టిన పిల్ల పార్టీ అని అప్పుడే పరుగులు పెడతా అంటే అది ప్రకృతికి విరుద్ధమని.పురుడు పోసుకున్నది ఇటీవలే నని రంగా వ్యాఖ్యానించారు.
పార్టీ పెట్టి తొమ్మిది నెలలు అయితే అడుగులు నేర్చుకోవచ్చని తెలిపారు.ఆమెపై అంతకు మించి మాట్లాడే పరిస్థితి ఏమీ లేదని ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వైఎస్ అంటే గౌరవిస్తామని.
పేర్కొన్నారు.ఇదే సమయంలో తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి పై కూడా మధుయాష్కి విమర్శలు చేశారు.
ఒకప్పుడు నిరంజన్ రెడ్డి అంటే గౌరవం ఉండేదని.కానీ ఇపుడు కెసిఆర్ కి నిరంజన్ రెడ్డి బానిసగా మారాడు అని సీరియస్ అయ్యారు.ఇదే తరుణంలో చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పై పోరా విమర్శల వర్షం కురిపించారు.అదేవిధంగా సిద్దిపేట కలెక్టర్ రామిరెడ్డి అవినీతిపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో కలిసి డిపిఓ కి కంప్లైంట్ చేస్తామని స్పష్టం చేశారు.
అవినీతి అధికారుల విషయంలో కేంద్ర హోంమంత్రి అదే రీతిలో ప్రధానికి ఫిర్యాదు చేశామని.మోడీ, అమిత్ షా అపాయింట్మెంట్ ఇప్పటికే కోరడం జరిగిందని.
భూముల అమ్మకం లో భారీ అవినీతి జరిగిందని.ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.