ఎగ్జిట్ పోల్స్ వెనుక 5 లక్షల కోట్ల కుంభకోణం అంటా! తులసిరెడ్డి విశ్లేషణ ఇది

ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపొయింది.ఆ పార్టీకి ఓటు బ్యాంకు కనీసం ఒక్క శాతం కూడా వచ్చిందో, లేదో డౌట్ గానే ఉంది.

 Congress Senior Leader Says Exit Polls Is A Big Scam-TeluguStop.com

ఇక కాంగ్రెస్ పార్టీని ఏపీలో నడిపించే నాయకుడు కూడా ప్రస్తుతం కనుచూపు మేరలో కనిపించడం లేదు.కాని ఆ పార్టీనే ఇంకా నమ్ముకొని కొంత మంది నాయకులు ఉన్నారు.

అప్పుడప్పుడు వారు మీడియా ముందుకొచ్చి సంచలన వాఖ్యలు చేసి ఓ రెండు రోజులు మీడియాలో కనిపిస్తారు.ఇప్పుడు కూడా అలాగే ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసీ రెడ్డి ఎగ్జిట్ పోల్స్ గురించి సంచలన వాఖ్యలు చేసి మీడియా ముందుకొచ్చారు.

మీడియా సంస్థలు చాలా ఆర్బాటంగా ప్రకటించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్నికల్లో బీజేపీకి ఆర్థిక సాయం చేసిన కార్పోరేట్‌ సంస్థల షేర్లు పెంచేందుకేనని అని అన్నారు.వీటి వెనుక 5.33 లక్షల కోట్ల కుంభకోణమని సంచలన ఆరోపణ చేసారు.ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమైన పోల్స్‌ కాదనే విషయం అందరికి తెలుసని ఈసారి ఎగ్జిట్‌ పోల్స్‌ కచ్చితంగా మానిప్యులేటెడ్‌ ఎగ్జిట్‌ పోల్సేనని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, దీనిని ఎవరు ఆపలేరని తులసీరెడ్డి చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube