తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్స్ మధ్య చాలా కాలంగా లుకలుకలు వున్నా సంగతి అందరికి తెలిసిందే.అవి రీసెంట్ గా జరిగిన తెలంగాణ ముందుఅస్తూ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర ఓటమి తర్వాత మరో సారి బహిర్ఘతం అయ్యాయి.
అయితే కేంద్రంలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం తెలంగాణ సీనియర్ లీడర్స్ ని పిలిపించి కాస్తా గట్టిగా మందలించడంతో కొంత వరకు అందరూ సైలెంట్ అయ్యారు.ఇదిలా వుంటే త్వరలో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి.
ఈ ఎన్నికలలో సీనియర్ లీడర్స్ లో చాలా మంది ఎంపీలు గా పోటీ చేయాలని ఆశపడుతున్నారు.అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు మాత్రం సీనియర్ లీడర్స్ అందరూ ఈ సారి పార్లమెంట్ ఎన్నికలకి దూరంగా వుండాలని, యువతకి అవకాశం ఇవ్వాలని చెప్పారు.
ఇదిలా వుంటే తాజాగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఐరన్ లేడీగా తెలంగాణ లో గుర్తింపు తెచ్చుకున్న రేణుక చౌదరి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం మీద చాలా గుర్రుగా వున్నారు.తాజాగా ఆమె తన కార్యకర్తలతో చర్చించిన మీదట ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తనకి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని, అలా అయితే ఖమ్మం పార్లమెంట్ స్థానం గెలిచి రాహుల్ కి గిఫ్ట్ గా ఇస్తా అని చెప్పిన రేణుక చౌదరి మీడియాతో చెప్పింది.
ఒక వేల ఎంపీ టికెట్ తనకి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సి వస్తుందని ఆమె నేరుగా అధిష్టానంకి హెచ్చరికలు పంపింది.ఈ నేపధ్యంలో రేణుక చౌదరి తిరుగుబాటు పట్ల తెలంగాణ పీసీసీ అధిష్టానం ద్రుష్టికి తీసుకెళ్లదానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.
మరి రేణుక తిరుగుబాటు స్వరంపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.