తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్దమైంది.అయితే దుబ్బాక ఉప ఎన్నిక నుండి మొదలుకొని గ్రేటర్ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా వరుసబెట్టి ఎన్నికలు జరుగుతున్నాయి.
అయితే దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ సత్తా చాటగా, గ్రేటర్ ఎన్నికలో టీఆర్ఎస్ గతంతో పోల్చితే కొన్ని సీట్లు కోల్పోగా, బీజేపీ ఒక్కసారిగా బలంగా తన సత్తాను చాటుకుంది.అయితే నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో నాగార్జున సాగర్ శాసన సభ స్థానం ఖాళీ అయింది.
అయితే ఆ స్థానానికి ఏప్రిల్ 17 న ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.అయితే నాగార్జున సాగర్ అంటే ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట.
తరువాత కాంగ్రెస్ తప్పిదంతో కంచుకోటకు బీటలు వారింది.నాగార్జున సాగర్ నియోజకవర్గం అనేది కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నియోజకవర్గం.
అయితే గతం ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ గాలిలో జానారెడ్డి సైతం ఓడిపోయాడు.అయితే ఇప్పుడు… అప్పుడు టీఆర్ఎస్ కు ఉన్న పరిస్థితులు లేవు కాబట్టి జానారెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువ.
అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రస్తుతం రాష్ట్రంలో చాలా వరకు బలహీనంగా ఉండడంతో మరి నాగార్జున సాగర్ ఎన్నికలో జెండా పాతుతాడో లేడో చూడాల్సి ఉంది.