నిన్న ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయిన తర్వాత మమతా బెనర్జీ మీడియాతో.మాట్లాడుతూ యూపీఏ ఓటమి పై సెటైర్లు వేయడం జరిగింది.
ఇంకెక్కడ యూపీఏ అంటూ చాలా ఎటకారంగా మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేశారు.దేశంలో యూపీఏ ఎక్కడా లేదని, ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకమైతే నే బీజేపీని ఓడించడం తేలిక అవుతుంది అని తెలిపారు.
ఈ సందర్భంగా మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ కీలక నేత కపిల్ సిబల్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ లేని యూపీఏ … ఆత్మలేని శరీరం అని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఉన్న ప్రతిపక్షాలు ఒకటవ్వాలని .కలిసికట్టుగా పోరాడాలని తెలిపారు.బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మమతా బెనర్జీ బిజెపికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో… కీలకంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో శరద్ పవార్ తో భేటీ అయిన తర్వాత.
యూపీఏపై ఆమె చేసిన వ్యాఖ్యలకు.కపిల్ సిబాల్ సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇచ్చారు.