ప్రస్తుతం తెలంగాణలో కరోనా ట్రీట్మెంట్కు ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో చూస్తూనే ఉన్నాం.కరోనా ట్రీట్మెంట్ను ఆరోగ్య శ్రీలో చేర్చాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.
ఇక దీని మీదనే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కదం తొక్కుతున్నారు.అయితే ఈ మధ్య పెద్దగా కలవని కాంగ్రెస్ నేతలు అందరూ ఇప్పుడు ఒక్క తాటిపైకి వచ్చారు.
టీపీసీసీ చీఫ్ విషయంలో మాటల యుద్ధం చేస్తున్న ముఖ్య నేతలంతా అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఒకే స్టేజి ఎక్కారు.
కరోనా ట్రీట్మెంట్ ను, బ్లాక్ ఫంగస్ ట్రీట్ మెంట్ ను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు గాంధీ భవన్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సత్యాగ్రహ దీక్షకు దిగారు.
ఇందులో ఉత్తమ్కుమార్రెడ్డి, జీవన్రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి లాంటి కీలక నేతలు పాల్గొన్నారు.వీరంతా కేసీఆర్ టార్గెట్గా విమర్శలు చేశారు.కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయంటూ ఉత్తమ్కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఇప్పటికైనా ఆరోగ్యశ్రీలో కరోనా ట్రీట్మెంట్ను చేర్చి, అందరికీ ఉచిత వైద్యం అందించాలంటూ కాంగ్రెస్ ముఖ్య నేతలు డిమాండ్ చేశారు.లేదంటే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు.కేసీఆర్ స్వయంగా కరోనా ట్రీట్మెంట్ను ఆరోగ్యశ్రీలో చేర్చుతామని మాట ఇచ్చినా దాన్ని నిలబెట్టకోవట్లేదని మండిపడ్డారు.
ప్రైవేటు ఆస్పత్రులకు కొమ్ముకాస్తూ ప్రజల జీవితాలను కేసీఆర్ చిన్నాభిన్నం చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే చాలా రోజుల తర్వాత నేతలంతా ఇలా ఒక్కతాటిపైకి వచ్చిపోరాడటం కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతోంది.ఇలాగే అందరూ కలిసికట్టుగా పోరాడితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడం ఖాయమని కిందిస్థాయి కార్యకర్తలు భావిస్తున్నారు.మరి నేతలు మున్ముందు కూడా అలాగే పోరాడుతారా లేదా అనేది చూడాలి.
ఏది ఏమైనా కాంగ్రెస్ అగ్రనేతలు ఇలా కలవడం ఇతర పార్టీలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.