తెలంగాణలోని మహాకూటమిలో ఉన్న పార్టీలకు రెబెల్స్ బెడద పెద్ద ముప్పుగా మారింది.ఏకంగా… రెబల్ అభ్యర్థులంతా ఓ కూటమిగా ఏర్పడి అందరికి షాక్ ఇచ్చారు.సుమారు 40మందితో కలిసి, రెబల్ ఫ్రంట్ పేరుతో ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు.అంతేకాకుండా టీడీపీ అసమ్మతి నేతలు కూడా తమతో టచ్లో ఉన్నారని వ్యాఖ్యానించారు.
టికెట్ దక్కని నాయకులంతా… కలిసి కట్టుగా ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని తెలంగాణ రెబల్స్ హెచ్చరిస్తున్నారు.పార్టీలో కొత్తగా చేరిన 19మందికి టికెట్లు అమ్ముకున్నారంటూ ఆరోపించారు.బలహీనమైనవారికి కూటమిలో టికెట్లు కేటాయించారని వ్యాఖ్యలు చేశారు.