ఎన్నికల ఫలితాలు వచ్చి వారం గడుస్తున్నా కూడా ఇంకా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ రావడం లేదు.పడ్నవీస్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అంటూ బీజేపీ నాయకత్వం చెబుతున్న సమయంలో శివసేన మాత్రం తమకు కూడా సీఎం పదవి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తోంది.105 స్థానాలు దక్కించుకున్న బీజేపీ 56 సీట్లు పొందిన శివసేనకు సీఎం పదవి ఇచ్చేందుకు ఆసక్తిగా లేదు.దాంతో శివసేన మరో మార్గంను అన్వేషిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా పావులు కదుపుతోంది.శివసేన పార్టీ తమతో కలిసి వస్తే ఎన్సీపీ మరియు శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామంటూ కాంగ్రెస్ ప్రకటించింది.
కాంగ్రెస్ మహారాష్ట్రలో అధికారంను దక్కించుకునేందుకు శివసేనకు ముఖ్యమంత్రి పీఠం ఇచ్చేందుకు కూడా సిద్దంగా ఉంది.కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీలు కలిసి ప్రభుత్వంను ఏర్పాటు చేస్తే బీజేపీకి పెద్ద షాక్ తప్పదు.