ఒకప్పుడు కాంగ్రెస్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా చక్రం తిప్పారు.బలమైన సామాజిక వర్గంతో పాటు ప్రజల్లో తిరుగులేని అభిమానం ఉండటంతో కాంగ్రెస్లో వారు ఏది చెబితే అది అన్న రేంజ్లో వారి హవా సాగింది.
ఇక తెలంగాణ వచ్చిన తర్వాత వీరికే పెద్ద పీట వేసింది కాంగ్రెస్.పరోక్షంగా పార్టీ వ్యవహారాలను కూడా నడిపించే లెవల్లో వారి మాటకు విలువ ఉండేది.
ఒకనొక దశలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికే టీపీసీసీ చీఫ్ పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు.కానీ అనూహ్యంగా రేవంత్రెడ్డికి పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ.
అప్పటి నుంచి వారి వ్యవహార శైలి అంటు కాంగ్రెస్ అగ్ర నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.దీంతో వారి రాజకీయ భవిష్యత్ ఇప్పుడు ప్రమాదంలో పడిందనే సందేహాలు వినిపిస్తున్నాయి.
పార్టీలో సీనియర్ నేతులుగా ఉన్నతంగా ఆలోచించి పార్టీని నడింపించాల్సింది పోయి పార్టీకి నష్టం చేస్తున్నారనే విమర్శలు కాంగ్రెస్ కార్యకర్తల నుంచే వస్తున్నాయి.ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్కు తిరుగులేని ప్రజాబలం ఉంది.
ప్రతి గ్రామంలో అభిమానులు కూడా ఉన్నారు.ఇంతలా బలం ఉన్న వారు తమ వ్యవహార తీరుతో చివరకు కార్యకర్తల్లో కూడా పట్టు కోల్పుతున్నారంట.
టీపీసీసీ చీఫ్ ఇవ్వలేదనే కోపంతో వెంటక్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ అగ్ర నాయకత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.చివరకు ఆయన్ను మందలించే వరకు తెచ్చుకుంటున్నారు.ఇంకోవైపు రాజగోపాల్ రెడ్డి కూడా బీఏపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసి పెను దుమారం రేపారు.ఓవైపు రేవంత్ నాయకత్వంలో పార్టీ బాగానే బలపడుతోంది.ఇలాంటి సందర్భంలో సపోర్టు ఇస్తే ఇంకా ముందుకు వెళ్లి వారికి కూడా పార్టీలో సముచిత స్థానం దక్కుతుందని నేతలు సూచిస్తున్నారు.లేదంటో ఢిల్లీ అధిష్టానం వేటు వేసే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఈ మధ్య పార్టీకి నష్టం చేసే వారిపై రాహుల్ గట్టిగానే షాక్ ఇస్తున్నారు.అందుకే వారి వ్యవహార శైలి మార్చుకోవాలని సూచిస్తున్నారు.