ఎఐసిసి ప్రెసిడెంట్, కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధి రాహుల్ గాంధీ ఈ రోజు తెలంగాణలో ఎన్నికల శంఖారావం సభ జరగనుంది.దీనికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లు, జన సమీకరణ చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైనా ఘోర పరాభవంకి ఎలా అయిన గట్టి సమాధానం చెప్పాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.ఆ పార్టీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలో టీఆర్ఎస్ పంచన చేరుతున్నారు.
ఇలాంటి టైంలో రాహుల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణ ప్రచారానికి వస్తున్నారు.
శంషాబాద్ వేదికగా జరుగుతున్నఈ భారీ బహిరంగ సభలో రాహుల్ తెలంగాణ ప్రజలకి ఎలాంటి హామీలు ఇస్తారు, అలాగే టీఆర్ఎ ప్రభుత్వం ఆపరేషన్ ఆకర్ష్ పైన మాట్లాడటమే కాకుండా, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ గా కూడా విమర్శలు చేసే అవకాశాలు వున్నాయి.
అయితే రాహుల్ పర్యటనలో తెలంగాణకి ఎన్నికల హామీలు వేటిపై ఇస్తాడు అనేదానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొని వుంది.