ఢిల్లీకి ఎవ్వ‌రూ రావొద్దు.. కాంగ్రెస్ అధిష్టానం హుకూం!

కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి అటు దేశంలో ఇటు రాష్ట్రంలో చాలా దారుణంగా త‌యారైంది.నాయ‌క‌త్వంపై సొంత పార్టీ నేత‌ల నుంచి అసంతృప్తి, వ్య‌తిరేక‌త వ‌స్తుండ‌టం ఆ పార్టీ నేత‌లకు త‌ల‌నొప్పిగా మారుతోంది.

 Congress Party To Announce Telangana New Pcc President Process Too Late, Congres-TeluguStop.com

పీసీసీ నియామ‌కం విష‌యంలో అధిష్టానం తీసుకునే నిర్ణ‌యాల‌ను గౌర‌వించ‌కుండా వారికి వ్య‌తిరేకంగా త‌మ గ‌ళాన్ని వినిపిస్తున్నారు ఆ పార్టీ నేత‌లు.

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర‌ప‌రాజ‌యానికి బాధ్య‌త‌వ‌హిస్తూ పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయ‌డంతో అధిష్టానం కొత్త పీసీసీ అధ్య‌క్షుని వేట‌లో ప‌డింది.

అయితే ఈ బాధ్య‌త‌ను ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌కు కాంగ్రెస్ అధిష్టానం అప్ప‌గించింది.ఇదే విష‌యంపై పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌తో స‌మావేశ‌మై అంద‌రి అభిప్రాయాల‌ను తీసుకుని ఆ సమాచారాన్నంతా రాహుల్ గాంధీకి ఆయ‌న‌ నివేధించారు.

మాణిక్కం ఠాగూర్ ఇచ్చిన నివేదిక ప్ర‌కారం పీసీసీ నియామ‌కం చేప‌ట్టాల‌నుకున్న క్ష‌ణంలో అధిష్టానానికి సొంత పార్టీ సీనియ‌ర్ నేత‌ల నుంచి చుక్కెదురైంది.ఇత‌రులెవ‌రికి పీసీసీ చీఫ్‌గా ఛాన్స్ ఇవ్వొద్ద‌ని.

ఆ అవ‌కాశాన్ని త‌మ‌కే ఇవ్వాల‌ని ఎవ‌రికి వారూ ఢిల్లీ బాట ప‌ట్టి రాహుల్‌ను, సోనియా గాంధీని ఇప్ప‌టికే ప‌లువురు నేత‌లు క‌లిశారు.ఇలా క‌లిసిన వారిలో కాంగ్రెస్ ఎంపీ కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి ఉన్నారు.

అలాగే మ‌రికొంత మంది సోనియా, రాహుల్‌గాంధీల‌ అపాయింట్‌మెంట్‌ల కోసం తెగ ట్రై చేస్తున్నారు.ఇలా పీసీసీ పీఠం కోసం ట్రై చేస్తున్న వారి సంఖ్య కాంగ్రెస్‌లో దాదాపు ప‌ది మందికిపైనే ఉంది.

Telugu @rahulgandhi, Congress, Pcc, Telangana, Tpcc-Telugu Political News

పీసీసీ పీఠం కోసం అంద‌రూ ఢిల్లీ బాట ప‌డుతుండ‌టం ఇప్పుడు అధిష్టానానికి త‌ల‌నొప్పిగా మారింద‌ట‌.ఇందుకు పీసీసీ పీఠం కోసం ఢిల్లీకి ఎవ‌రూ రాకూడ‌ద‌నే హుకూంను అధిష్టానం జారీ చేసింద‌ట‌.తాము పిలిచేంత వ‌ర‌కు ఎవ‌రూ రాకూడ‌ద‌ని అందరికీ తేల్చి చెప్పేశార‌ట‌.పీసీసీ నియామ‌కం, అభ్య‌ర్థి ఎంపిక కొత్త త‌ల‌నొప్పులు ఎక్క‌డ తెచ్చిపెడ‌తాయ‌నే ఉద్ధేశ్యంతో పీసీసీ నియామ‌కంపై కొంత స‌మ‌యం వ‌ర‌కు వేచి చూడాల‌నే ధోర‌ణీలో అధిష్టానం ఉన్న‌ట్లు పార్టీ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

మాణిక్కం ఠాగూర్ కూడా ఢిల్లీ నుంచి త‌మిళ‌నాడుకు వెళ్లిపోయారు.ఈ నెల 22 వ‌ర‌కు ఆయ‌న ఢిల్లీకి తిరిగి వెళ్లే ఛాన్స్ లేదు.అప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ కూడా ఢిల్లీకి రాకూడ‌ద‌ని ఆయ‌న నేత‌ల‌తో చెప్పిన‌ట్లు స‌మాచారం.

అలాగే పీసీసీ నియామ‌కం ముందు సీనియ‌ర్ల అభిప్రాయాన్ని రాహుల్‌, సోనియాలు మ‌రొక‌సారి తీసుకునే అవ‌కాశం కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అప్ప‌టి వ‌ర‌కు పీసీసీ చీఫ్ నియామ‌కంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోకూడ‌ద‌నే ఆలోచ‌న‌లో అష్టానం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube