నాయకులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.ఏం మాట్లాడుతున్నామో గ్రహించుకొని మాట్లాడాలి.
లేకపోతే కొంపలు మునిగిపోతాయి.రాజ్యసభ నుంచి నిన్న రిటైరైన కాంగ్రెస్ సభ్యుడు వి హనుమంతరావు తన వీడ్కోలు ప్రసంగంలో పార్టీ అధినేత, తన ఆరాధ్య దైవం సోనియా గాంధీని చంపేశారు.
దివంగత ఇందిరా గాంధీ (లేట్ ఇందిరా గాంధి) దివంగత సోనియా గాంధీ అనేశారు.కానీ వెంటనే తప్పు సరిచేసుకున్నారు.
ఇది రాసుకొచ్చిన ప్రసంగమే అయినప్పటికీ పొరపాటు పడ్డారు.
తప్పు సరిచేసుకోగానే తనకు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చినందుకు సోనియాతోపాటు రాజీవ్ గాంధీకి, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు.
ఈ జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగును కూడా చేర్చారు.గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సభలో మాట్లాడుతూ పొరపాటుగా నేను మీ ముందు ప్రధానిగా.
అని వెంటనే తప్పు గ్రహించి నేను మీ ముందు ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నాను అన్నారు.ఎన్టీఆర్ బతికుంటే ప్రధాని అయ్యేవారని ఇప్పటికీ కొందరు నాయకులు అంటూ ఉంటారు.
మొత్తం మీద రాజ్యసభలో హనుమన్నా పదేళ్ళ శకం విజయవంతంగా ముగిసింది.