ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం కొనసాగుతోంది.ఇండియాలో కరోనా కేసులు రోజుకు వేలల్లో నమోదు అవుతున్నాయి.
లాక్ డౌన్ సడలించిన తర్వాత ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగాయి.ఈమద్య కాలంలో ఎంతో మంది సినీ మరియు రాజకీయ ప్రముఖులకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.
ఇప్పటికే కొందరు మృత్యువాత పడ్డారు.ఇప్పుడు మరో రాజకీయ నాయకుడు కరోనా బారిన పడి మృతి చెందాడు.
తమిళనాడుకు చెందిన ఎంపీ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్.వసంతకుమార్ కరోనాతో పోరాడి ఓడిపోయారు.
కన్యాకుమారి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు అయిన వసంతకుమార్ ఈనెల 10వ తారీకున కరోనా బారిన పడ్డాడు.ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స కోసం జాయిన్ అయ్యారు.
ఎక్మో సాయంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు.ఈ సమయంలో ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో మృతి చెందినట్లుగా వైధ్యులు పేర్కొన్నారు.
ఆయన భార్య కూడా కరోనాతో పోరాటం చేస్తున్నారు.వసంత కుమార్ మృతిపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు.