కరోనా సమయంలో కోవిడ్ బారినపడిన పేషెంట్స్ బాధలు వర్ణానీతం.ఒకవైపు కరోనా నుండి త్వరగా కోలుకోవాలనే ఆరాటంలో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి అప్పులపాలు అవుతున్నారు.
మరో వైపు ప్రవేట్ ఆస్పత్రుల దోపిడికి అడ్డుకట్ట వేసే వారు లేక విచ్చలవిడిగా అందిన కాడికి దోచుకుంటున్నారు. n
ఒక్కో పేషెంట్స్ హాస్పిటల్ నుండి డిశ్చార్చ్ అయ్యే వరకు దాదాపుగా 20లక్షల వరకు బిల్లులు వసూల్ చేసిన చరిత్ర కూడా ఉంది.
ఈ విషయంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ హైకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ నేపధ్యంలో ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ పిల్ వేశారు.
ఇక ఇప్పటికే ఆంద్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలు ఈ విధానాన్ని అమలు చేస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.అంతే కాకుండా రాష్ట్రంలో ఉన్న చాలా ప్రైవేట్ ఆస్పత్రులు జనాలను జలగల్లా పీడిస్తున్న విషయాన్ని పిల్ ద్వారా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
ఒకవేళ హైకోర్టు ఈ విషయంలో ప్రజలకు అనుకూలంగా తీర్పునిస్తే కనీసం కరోనాతో లక్షలకు లక్షలు అప్పులు చేస్తున్న వారికి కాస్త ఊరట లభించవచ్చూ.