కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యే జగ్గా రెడ్డి చేసే విమర్శలు ఆసక్తికరంగా ఉంటాయి.ఎవరి మీద ఆయన విమర్శలు చేయాలనుకున్నా ఎక్కడా మొహమాటం పడకుండా ఆయన చేసే విమర్శలు ప్రత్యర్థులకు సూటిగా తగులుతుంటాయి.
తాజాగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అభ్యంతరకరంగా మాట్లాడ్డం సరికాదు అంటూ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.అసలు రాహుల్ స్థాయికి, కేటీఆర్ స్థాయికి పోలిక ఎక్కడ ఉంది అంటూ ఆయన ప్రశ్నించారు.
ప్రధాని పదవిని సైతం వద్దు అంటూ త్యాగం చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ అని, కేటీఆర్ను ఆయనతో పోల్చడం సరికాదని అన్నారు.
కేటీఆర్ను పొగుడుకో, భజన చేసుకో తప్పులేదు కానీ కేటీఆర్ దగ్గర చెంచాగిరి చెయ్యకు అంటూ దయాకర్ రావు ను ఉద్దేశించి అన్నారు.
మంత్రులు రాహుల్ గాంధీ గురించి చిల్లర విమర్శలు మానుకోవాలని లేకపోతే, తాము కూడా అదే తరహలో ప్రతి విమర్శలు చేస్తామని జగ్గారెడ్డి హెచ్చరికలు చేశారు.