సిఎల్ఫీ నేత,కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది.వడదెబ్బ కారణంగా ఆయన అస్వస్థతకు గురవ్వడం తో ఖమ్మంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.
ఆయన గత నాలుగు రోజులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ఆయన వడదెబ్బ కు గురైనట్లు తెలుస్తుంది.
త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉండటంతో పార్టీని వీలైనన్ని స్థానాల్లో గెలిపించడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేపట్టారు.
దీనిలో భాగంగా భట్టి ఈ యాత్రలో పాల్గొనగా వడదెబ్బ కు గురయ్యారు.
దీనీతో ఆయనను ఖమ్మలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తుంది.
గతంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విఫలమైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఎంపీటీసీ,జడ్ పీ టీసీ ఎన్నికల్లో అయినా విజయాన్ని అందుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది.
ఈ క్రమంలోనే అక్కడ యాత్రలు చేపట్టి ప్రజలలో అవగాహన కల్పించేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంది.