తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకోకపోయినా … గెలిచిన ముఖ్య నేతలలో కొంతమంది మధ్య పోటీ వాతావరణం నెలకొంది.ఓ పదవి కోసం నాకు అంటే నాకు అంటూ కాంగ్రెస్ మార్క్ రాజకీయానికి తెరతీశారు.
తెలంగాణ కాంగ్రెస్ లో ప్రతిపక్ష నేత పదవి కోసం పోటీ ఎక్కువయ్యింది.ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ ర్యాంకు ఉండడం, ప్రభుత్వ పరంగా అన్ని సదుపాయాలు ఉండడంతో సహజంగానే ఈ పదవికి ఇంత డిమాండ్ ఏర్పడడానికి కారణం.
పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి తనకే ఆ బాద్యత ఇవ్వాలని కోరుతుండగా, పార్టీని విజయపదం వైపు నడిపించలేని నేతకు, భార్యనే గెలిపించలేని వ్యక్తికి ప్రతిపక్ష నేత పదవి ఇస్తారా అని ఆయాన వ్యతిరేక వర్గం ప్రశ్నిస్తోంది.అలాగే కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థిగా ప్రచారం పొందిన మల్లు భట్టి తనకు డిల్లీలో ఉన్న పరిచయాలతో… ఈ పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు.కాగా మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా రంగంలో ఉన్నారట.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈ పదవి అప్పగించాలని ఆయన అనుచరులు కోరుతున్నారు.అయితే అధిష్టానం ఎవరివైపు మొగ్గుచూపుతుందో చూడాలి.