హైదరాబాద్ గాంధీభవన్లో కాంగ్రెస్ నేతలు నిరసన దీక్ష చేపట్టనున్నారు.మధ్యాహ్నం ప్రారంభం కానున్న ఈ దీక్ష సాయంత్రం 5 గంటల వరకు సాగనుంది.
గాంధీభవన్ లోని గాంధీ విగ్రహం వద్ద నేతలు మౌనదీక్ష చేపట్టనున్నారని తెలుస్తోంది.పరువు నష్టం కేసులో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంపై ఆందోళన చేపట్టనున్నట్లు సమాచారం.
కాగా ఈ మౌన దీక్షలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.