ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్లకూడదని ఏపీ కాంగ్రెస్ నాయకులు వెళ్ళడం లేదు.ప్రభుత్వం తమను సరైన రీతిలో మర్యాదపూర్వకంగా ఆహ్వానించలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
వై కా పా అధినేత జగన్ బాటలోనే నడవాలని నిర్ణయించారు.జగన్ మాదిరిగానే రైతుల భూములు బలవంతంగా గుంజుకున్నారని ఆరోపించారు.
ఆంద్ర కాంగ్రస్ నాయకులు వెళ్ళడంలేదు కాబట్టి తెలంగాణా నాయకులు కూడా మానుకుంటారో ఏమో.రెండు తెలుగు రాష్ట్రాల సీపీఎమ్ నాయకులు కూడా శంకుస్థాపనకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకుల సందడే ఉంటుంది.