తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె తీవ్రతరం అయ్యింది.మొదటి నుండి కూడా ప్రభుత్వం ఒకే విధానంతో ముందుకు సాగుతుంది.
కాని ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అనుకూలంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.దాంతో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కొందరు వెనుక నుండి మద్దతు ఇచ్చి ప్రభుత్వంను పడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మండి పడింది.
ఆమె మాట్లాడుతూ బీజేపీలోకి టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు కొందరు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారు.
ఆ విషయాన్ని బయట పెట్టకుండా ప్రభుత్వం పడగొట్టేందుకు ప్రయత్నాలు అంటూ ఇండైరెక్ట్గా బీజేపీని అనేందుకు విపక్షాలు ప్రభుత్వంను పడగొట్టేందుకు కుట్ర చేస్తున్నాయంటూ కేసీఆర్ మాట్లాడాడు అంటూ విజయశాంతి అంది.బీజేపీని నేరుగా మాట అనే ధైర్యం దమ్ము కేసీఆర్కు లేవా అంటూ ప్రశ్నించింది.
నీ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు నీ ప్రభుత్వంను పడగొట్ట బోతున్నట్లుగా నీకు అర్థం అయ్యిందా అంటూ విజయశాంతి ప్రశ్నించింది.