హుజూరాబాద్ ఉప ఎన్నికల టైంలో దళిత బంధు పథకాన్ని తెరపైకి తెచ్చింది టీ.ఆర్.
ఎస్ ప్రభుత్వం.సీఎం కే.సి.ఆర్ దత్తత గ్రామ అయిన వాసాలమర్రిలో ఈ పథకాని ప్రారంభించారు.ఇప్పటికే దళిత బంధు నిధులు రిలీజ్ చేశారు.దళిత బంధు ప్రకటించిన తర్వాత రకరకాల బంధులు తెర మీదకు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేట వి.హనుమంతరావు స్పందించారు.దళితులకు దళిత బంధు ఇచ్చినట్టే బీసీలకు బీసీ బంధు ఇవ్వాలని అన్నారు.ఎన్నికలు వచ్చినప్పుడే పథకాలు గుర్తుకొస్తాయా అంటూ సీఎం కే.సి.ఆర్ ను ప్రశ్నించారు.
అంతేకాదు పంజాగుట్ట సర్కిల్ లో ఉండాల్సిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎన్ని రోజులు స్టేషన్ లో ఉంచుతారని అన్నారు.ఆ విగ్రహాన్ని వెంటనే సర్కిల్ లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
దళిత బంధు పథకం ఇచ్చినట్టే బీసీలకు బీసీ బంధు కూడా ఇవ్వాలని.బీసీ బంధు ఇవ్వకుంటే టీ.ఆర్.ఎస్ కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు వీహెచ్.దళిత బంధు ప్రకటించిన తర్వాత వివిధ కులాలు తమకు కూడా ప్రత్యేక బంధు పథకం కావాలని డిమాండ్ చేస్తున్నాయి.బీసీ బంధు పై ఆర్.కృష్ణయ్య లాంటి నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.