చైనా లో మొదలైన కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది.అగ్రరాజ్యం సైతం అల్లాడిపోతున్న ఈ కరోనా మహమ్మారి గురించి ఎవరికీ తోచిన సలహాలు వారు ఇస్తూనే ఉన్నారు.
భారత్ లో కూడా కరోనా విజృంభిస్తుండడం తో ఆయుర్వేద చిట్కాల తో పాటు పలు చిట్కాలు ఎవరో ఒకరు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తుండడం తో అవి ట్రోల్ అవుతూ ఉన్నాయి.ఇప్పటికే గోమూత్రం,గోపిడక వంటికి ఉపయోగించడం తో కరోనా ను తరిమికొట్టొచ్చు అంటూ చాలా మంది సలహాలు ఇచ్చారు.
అయితే ఇప్పుడు తాజాగా ఒక కాంగ్రెస్ నేత తనకు తోచిన సలహా ఇచ్చాడు.
నిజంగా ఈ సలహా మందుబాబులకు అయితే బాగా నచ్చుతుంది అని చెప్పాలి.
ఇంతకీ ఆ నేత ఇచ్చిన సలహా ఏంటంటే ఈ మహమ్మారిని తరిమికొట్టాలి అంటే రమ్ తాగండి,ఫ్రై చేసిన గుడ్లు తినండంటూ ఒక వీడియో ను రూపొందించారు.ఆ వీడియో సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో మందుబాబులకు నచ్చిందో ఏమో గానీ ఆ వీడియో తెగ వైరల్ గా మారింది.
కర్ణాటకలోని మంగళూరులోని ఉల్లాల్ సీఎంసీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ రవిచంద్రగట్టి కరోనా వైరస్ నియంత్రించేందుకు ఓ ఇంటి చిట్కాను చెబుతూ ఒక వీడియో రూపొందించారు.అయితే ఆ వీడియోలో 90 ఎంఎల్ రమ్ములో టీ స్పూన్ మిరియాల పొడిని కలుకుని, రెండు ఆఫ్ బాయిల్డ్ కోడి గుడ్డును తినండి అంతే కరోనా మీ దరిచేరదు అంటూ ఆ వీడియో లో పేర్కొన్నాడు. నేను ఒక రాజకీయ నాయకుడిగా ఈ విషయాన్నీ చెప్పడం లేదు నిజంగానే ఇది నేను స్వయంగా వాడి తెలుసున్న సత్యం అంటూ జ్ఞానబోధ చేశాడు.మొత్తానికి ఈ వీడియో వైరల్ గా మారడం తో మందుబాబులు ఇక ఆ పనిలోనే పడినట్లు అనిపిస్తుంది.