తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తి కొండా విశ్వేశ్వర్ రెడ్డి.టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కొండా విశ్వేశ్వర్ రెడ్డి కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను వరుసగా తన వైపు లాగేసుకుంటుంది.ఓ విధంగా చెప్పాలంటే తెలంగాణలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనే ఆలోచనతో టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేస్తూ టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం కోసం రెడీ అయిపోతున్నారు.టిఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ తీరుకు నిరసనగా నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు.మంగళవారం నుంచి ఆయన నిరాహారదీక్ష చేస్తానని మీడియాతో తెలియజేశారు.
అది టన్ లో లో కేసీఆర్ పైన హరీష్ రావు పైన తీవ్రవిమర్శలు గుప్పించారు.