నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఇక్కడ పోటీలో ఉన్న నేతల మాటల్లో పదును పెరుగుతుండగా, ఒకరి పై ఒకరు చేసుకుంటున్న విమర్శలు తారాస్దాయికి చేరుకున్నాయి.
కాగా ఈ పోటీ రణరంగాన్ని తలపిస్తుండగా గెలిచే వారెవరో తెలియదు గానీ అంచనాలు మాత్రం ఊహించని స్దాయిలో పెరిగాయి.ఇకపోతే తామంటే తామే గెలుస్తామనే నమ్మకంలో తమ అభ్యర్థుల గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు నేతలు.
ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికూడా తమ అభ్యర్థి జానారెడ్డి గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేస్తూ, టీఆర్ఎస్ నేతలు ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు డబ్బు, మద్యం పంచినప్పటికీ కాంగ్రెస్కే ఓటేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్ పార్టీ కాంట్రాక్టర్ల కమీషన్ల కోసమే పనిచేస్తోందని ఆరోపణలు గుప్పించారు.
ఇక ఇక్కడ బీజేపీకి కూడా డిపాజిట్ దక్కదని పేర్కొన్నారు.మరి రిజల్ట్ వస్తే గానీ తెలియదు ప్రజలు ఎవరిని ఆదరిస్తారో.