తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డి ఈడీ విచారణ ముగిసింది.నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో భాగంగా ఆమె ఈడీ అధికారుల ఎదుట హాజరైయ్యారు.
ఈ క్రమంలో పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 50 ఏ ప్రకారం గీతారెడ్డిని అధికారులు ప్రశ్నించారు.దాదాపు 3 గంటల పాటు ఈ విచారణ సాగినట్లు తెలుస్తోంది.
యంగ్ ఇండియా లిమిటెడ్ కు ఇచ్చిన విరాళాలపై ఆమె స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు.అనంతరం ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన గీతారెడ్డి తన విచారణ ముగిసినట్టు వెల్లడించారు.