కాంగ్రెస్ నేతలను దొంగలతో పోల్చి సంచలనం రేపుతున్న తెలంగాణా ఐటీ శాక మంత్రి కేటీఆర్, ఇప్పటి వరకు ఏది మాట్లాడినా ఆసక్తిగానే ఉన్నాయి.ఒక డేరింగ్, డాషింగ్ పర్సనాలిటీ అని ఆయనని పేర్కొనచ్చు.
సూర్యాపేట జిల్లా మద్దిరాలలోజరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి కొన్ని ఆసక్తిరేపే వ్యాఖ్యలు చేసారు.
కాంగ్రెస్ నేతలు బస్సు యాత్రలను చేయడాన్నిప్రస్తావిస్తూ, ‘ ఆలీబాబా 40 దొంగలు అన్నట్టుగా జానా బాబా 40 దొంగల మాదిరి సిగ్గు, ఎగ్గూ లేకుండా బస్సు యాత్ర చేస్తున్నారు.
వీరందిరిపైన కేసులున్నాయి’ అని కేటీఆర్ ఎద్దేవా చేసారు.
ఈ ప్రాంతంలో లక్ష ఎకరాలకు సాగునీరందించేలా వెంపటి, రుద్రమదేవి చెరువులను కలుపుతూ పెద్ద జలాశయాన్ని ఏర్పాటు చేసి ,జిల్లాను అభివృద్ధి మార్గంలో నడిపిస్తామని అన్నారు.50 సంవత్సరాల పాటు రాష్ట్రాన్నిపాలించిన కాంగ్రెస్ పార్టీ , జిల్లాకు కృష్ణా జలాలను తెచ్చుంటే 2 లక్షల మంది ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడేవారు కాదని, 15 సంవత్సరాలపాటు రాష్ట్రానికి మంత్రిగా ఉన్న జానాకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తాగేందుకు మంచి నీరు దొరకక ప్రజలు పడుతున్న అవస్థలు కనిపించలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు
తెలంగాణాని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన తరువాత ఈ మూడు సంవత్సరాల వ్యవధిలో రూ.30 వేల కోట్ల పెట్టుబడి జిల్లాకు వచ్చిందని గుర్తు చేసారు కేటీఆర్.యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించేందుకు తుంగతుర్తి సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని, ఆ బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటున్నానని వెల్లడించారు
.