పంజాబ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది.
ముఖ్యంగా పార్టీ ఫైర్ బ్రాండ్ సిద్ధూ.అదే రీతిలో పంజాబ్ సీఎం అమరేందర్ మధ్య ఉన్న విభేదాలు తొలగించడానికి కాంగ్రెస్ హైకమాండ్ నాయకులు ఇప్పటికే రంగంలోకి దిగారు.
ఈ క్రమంలో సిద్దూతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భేటీ కావడం జరిగింది.ఇదిలా ఉంటే తాజాగా సీఎం అమరేందర్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ఈరోజు భేటీ కాబోతున్నారు.
ఈ సమావేశంలో త్వరలో ఎన్నికలు ఇంకా తాజా రాజకీయాలపై చర్చలు జరపనున్నారు.ఇక ఇదే టైములో సిద్దూకి అమరేందర్ కి మధ్య మరోసారి వివాదం జరగకుండా సోనియాగాంధీ సరికొత్త ఎత్తుగడ వేసినట్లు సమాచారం.ఏదిఏమైనా జరగబోయే పంజాబ్ ఎన్నికలలో పార్టీ నాయకులు అందరిని ఒకే తాటి పైకి తీసుకురావాలని కాంగ్రెస్ హైకమాండ్ .పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ సంక్షోభాన్ని తొలగించడానికి తీవ్ర ప్రయత్నాలు స్టార్ట్ చేయడం జరిగింది.