త్వరలో పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పాండిచ్చేరి ఓటర్లకు వెరైటీ హామీలు ఇవ్వడం జరిగింది.
జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేస్తామని పేర్కొంది. నీట్ పరీక్ష రద్దు, నూతన విద్యా విధానం తో పాటు గృహిణిలకు వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం, అమరవీరులకు పెన్షన్ పెంపు విధానం, స్థానికులకు విద్యావ్యవస్థలో 25 శాతం రిజర్వేషన్, అన్ని ఇళ్లకు ఉచిత మంచినీటి సరఫరా, వితంతువులకు, నిరాశ్రయులైన మహిళలకు 5000 పెన్షన్ స్కీమ్ పెంచనున్నట్లు హామీ ఇచ్చారు.
ఇవే కాకుండా విద్యార్థులకు వైఫై, ఉచిత జిబి డేటా, ల్యాప్ టాప్ లు ఫ్రీగా బస్ పాసులుఅందించనున్నట్లు స్పష్టం చేశారు.పుదుచ్చేరి కి ప్రత్యేక రాష్ట్ర హోదా తీసుకొస్తామని, కేంద్రం వద్ద తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని పేర్కొంది.
ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు.