ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి, క్లీన్ స్వీప్ చేస్తుంది అనుకున్న తెరాస కి కాంగ్రెస్ షాక్ ఇచ్చింది.మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరిగిన తరుణంలో ఆరు స్థానాల్లో తెరాస గెలవగా మిగిలన ఆరు చోట్లా మొన్న ఇరవై ఏడున పోలింగ్ జరిగింది .
వీటి ఫలితాలు ఇప్పుడిప్పుడే బయటకి వస్తున్నాయి.
మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఐదు స్థానాల ఫలితాల్లో తెరాస – కాంగ్రెస్ ల మధ్య తీవ్ర పోటీ నడిచింది అట.స్థానిక రాజకీయాల మీద అవగాహన లేని వారికి ఈ ఫలితం ఆశ్చర్యానికి గురి చేసింది.మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బలం ఏ మాత్రం తగ్గలేదన్న విషయం తాజా ఫలితం స్పష్టం చేస్తున్నాయి ఈ ఫలితాలు.
ఎమ్మెల్సీ బరిలో తన సోదరుడు ని కోమటి రెడ్డి గెలిపించుకోగలిగారు.తెరాస మూడు స్థానాలలో గెలవగా ఒకటి ఖమ్మం , మహబూబ్ నగర్ లో చాలా తక్కువ ఓట్లతో గెలిచింది.
ఖమ్మం ఎమ్మెల్సీ స్థానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ31 ఓట్ల తేడాతో విజయం సాధించారు.మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో తెలంగాణ అధికారపక్ష అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి విజయం సాధించారు.
తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 65 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.